జగిత్యాల :

సామాజిక బాధ్యతతో అర్హులైన ప్రతీ ఒక్కరి పేరును ఓటరు జాబితాలో నమోదు చేయించాలని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా అన్నారు. శనివారం సాయంత్రం IDOC సమావేశ మందిరంలో క్యాంపస్ అంబాసిడర్ లకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, కళాశాల, విద్య సంస్థలలో చదువుతున్న 18 ఏళ్లు నిండిన ప్రతీ ఒక్కరి పేరును ఓటరుగా నమోదు చేయించాలని, మంచి వ్యక్తికి ఓటు వేసే విధంగా కృషి చేయాలని అన్నారు.

గత అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అంబాసిడర్లు కృషి వలన 0.86 శాతం నుండి 3.85 శాతం వరకు యువత పేర్లు నమోదు చేయడం జరిగిందని, ప్రస్తుతం 2.85 శాతం ఉందని, 4 శాతం వరకు నమోదుకు తీసుకురావాలని అన్నారు.

యువత ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా నిర్భయంగా మంచి వ్యక్తికి ఓటు వేయాలని అన్నారు. అదనపు కలెక్టర్ బి.ఎస్.లత మాట్లాడుతూ, ప్రతీ విద్యార్థి చరిత్ర, ప్రజాస్వామ్యం ల పై అవగాహన కలిగి ఉండాలని అన్నారు.

ప్రజాస్వామ్యం పరిపుష్టి చేయాల్సిన బాధ్యత యువతపై ఉందన్నారు. అర్హులైన వారి పేర్లను నమోదు చేయాలని అన్నారు.ఎన్నికలు సజావుగా నడిచే విధంగా, ఎథికల్ ఓటింగ్ జరిగే విధంగా పాటుపడాలని అన్నారు.

అంతకుముందు స్వీప్ నోడల్ అధికారి కె.లక్ష్మి నారాయణ జిల్లాలోని 28 డిగ్రీ, 75 జూనియర్ కళాశాలలు, 6 ప్రొఫెషనల్ కళాశాలల్లో అంబాసిడర్ లను నియమించడం జరిగిందని, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ కార్యక్రమంలో మెంటర్లు, కళాశాలల అంబాసిడర్లు , తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Verified by MonsterInsights