రాయికల్ (తాట్లవాయి): (S.Shyamsunder)

గొడ్డలితో నరికి…బావిలో పడేసారని పోలీసుల అనుమానం-తాట్లవాయిలో దారుణం-పండగపూట విషాదం

జగిత్యాల నియోజకవర్గం రాయికల్ మండలం తాట్లవాయి గ్రామంలో శుక్రవారం  దారుణం చోటు చేసుకుంది.తాట్లవాయి గ్రామానికి చెందిన 24సం.ల నాగెల్లి సురేష్ అనే యువకుడిని  గుర్తు తెలియని దుండగులు గొడ్డలితో మెడను నరికి దారణంగా హతమార్చి  వ్యవసాయ బావిలో పడేసి వెళ్లినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. 

పోలీసులు, గ్రామస్తుల కథనం మేరకు.. ఈ నెల 7న ఉదయం పొలానికి వెళ్లుతున్ననంటూ.. ఇంట్లోంచి బయటకు వెళ్లిన సురేష్  శుక్రవారం బావిలో శవమైయ్యాడని కుటుంబీకులు రోదిస్తూ తెలిపారు. రాత్రయినా కూడా సురేష్ ఇంటికి రాకపోవడంతో అతని కుటుంబసభ్యులు, బంధువులు శుక్రవారం పొలం వద్ద వెతికారు. బావి సమీపంలో మృతుడి ద్విచక్రవాహనం, చెప్పులు లభించాయి.

దాంతో కంగారు పడిన బంధువులు శుక్రవారం ఉదయం 10-30 గంటల ప్రాంతంలో పోలీసులకు సమాచారం ఇచ్చి బావి చుట్టు గాలించారు. బావి వద్ద రక్తమరకలు కనడబటంతో బావిలో ఉన్న నీరును మోటర్ల ద్వారా తొలగించగా శవం లభించింది. గుర్తు తెలియని దుండగులు సురేష్ను గొడ్డలితో తల వెనుక బాగంలో నరికి చంపి వేసి అతడి వ్యవసాయ బావిలోనే పడవేసి ఉంటారని భావిస్తున్నారు.

మృతుడి తల్లిదండ్రులకు ముగ్గురు సంతానం కాగా… ఇతడు చిన్నవాడు. గ్రామంలో వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తుంటాడు. గ్రామ శివారులోని తన వ్యవసాయ బావిలోనే దుండగులు అతన్ని చంపి పడేసి వెళ్లారని పోలీసులు భావిస్తున్నారు.  బావిలో నుండి శవాన్ని బయటకు తీయగా మృతుడి శరీరంపై చాల చోట్ల గాయాలున్నట్లు పోలీసులు గుర్తించారు. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి పంపి కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు ఎస్ఐ అజయ్ తెలిపారు. కాగ పూర్తిస్థాయి విచారణ జరిపి హత్య వివరాలు వెలికతీయాలని గ్రామస్తులు కోరుతున్నారు.

ఘటనా సమాచారం అందుకున్న పోలీసులు డాగ్స్క్వాడ్ తో విచారణ చేపట్టారు.. సంఘటన స్థలాన్ని జగిత్యాల డిఎస్పీ రఘుచందర్, సిఐ ఆరిఫ్అలిఖాన్, ఎస్ఐ అజయ్లు సందర్శించారు. హత్య  వ్యవహరంపై క్షేత్రస్థాయిలో విచారణ జరుపుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Verified by MonsterInsights