మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి,  సిఎం ముఖ్య కార్యదర్శి శేషాద్రి మరియు కార్యదర్శులను మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కలనందించిన ఐ అండ్ పిఆర్ స్పెషల్ కమిషనర్

హైదరాబాద్, ఫిబ్రవరి 6 :

రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ ప్రత్యేక కమిషనర్ గా ఎం. హనుమంతరావు సోమవారం బాధ్యతలు స్వీకరించిన సంగతి తెల్సిందే.

ఈ సందర్భంలో మంగళవారం తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డితో పాటుగా, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి,

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి,  ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి శేషాద్రి, కార్యదర్శులు షానవాజ్ ఖాసిం, అజిత్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి  లను మర్యాద పూర్వకంగా కలిసి, పూల మొక్కలను అందించారు.

ఈ సందర్భంగా వారు రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ ప్రత్యేక కమిషనర్ గా ఎం. హనుమంతరావుకు శుభా తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Verified by MonsterInsights