సిరిసిల్ల: (sampath panja)

సిరిసిల్ల పట్టణంలోని బైపాస్ లో నూతనంగా నిర్మిస్తున్న జిల్లా పోలీస్ కార్యాలయాన్ని సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ లు సంబంధిత అధికారులకు సూచించారు.

సోమవారం రోజున సిరిసిల్ల పట్టణంలోని బైపాస్ లో కొత్తగా నిర్మించిన జిల్లా పోలీస్ కార్యాలయాన్ని ట్రైనీ ఐపీఎస్ రాహుల్ రెడ్డి, అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ జిల్లా అధికారులతో కలసి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ లు క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.

ఎస్పీ ఛాంబర్, గ్రీవెన్స్ సెల్ హాల్, సిసి కెమెరాల కమాండ్ కంట్రోల్ రూమ్స్, మీటింగ్ హాల్ ,రిసెప్షన్ కౌంటర్ మరియు జిల్లా కార్యాలయ వివిధ విభాగాలకు రూమ్స్ ను పరిశీలించి తుది దశలో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేసి గార్డెనింగ్,లైటింగ్ తో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది, ప్రారంభోత్సవనికి సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Verified by MonsterInsights