‘నా తెలంగాణ కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు..’ ప్రధాని మోది

రానున్న ఐదు సంవత్సరాలలో అన్ని రంగాలలో తెలంగాణను అభివృద్ధి చేస్తాం:జగిత్యాల సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోది  -అడుగడుగునా ప్రసంగం మధ్యలో మోడి మోడి అంటూ సభికుల నినాదాలు-నారీశక్తివందన్ పై మహిళల్లో ఉత్సాహం ‘నా తెలంగాణ కుటుంబసభ్యులందరికీ నమస్కారాలు’ అంటూ ప్రధాన మంత్రి నరేంద్ర మోడి తెలుగులో తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో భాజపా ప్రజలందరి ఆశీర్వాదంతో 400 సీట్లు గెలుచుకోబోతుందని… రానున్న ఐదు సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి దిశలో ముందుకు తీసుకెళ్తామని ప్రధానమంత్రి […]

నూతన జిల్లా పోలీస్ కార్యాలయాల సముదాయాన్ని ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలి:జిల్లా కలెక్టర్

సిరిసిల్ల: (sampath panja) సిరిసిల్ల పట్టణంలోని బైపాస్ లో నూతనంగా నిర్మిస్తున్న జిల్లా పోలీస్ కార్యాలయాన్ని సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ లు సంబంధిత అధికారులకు సూచించారు. సోమవారం రోజున సిరిసిల్ల పట్టణంలోని బైపాస్ లో కొత్తగా నిర్మించిన జిల్లా పోలీస్ కార్యాలయాన్ని ట్రైనీ ఐపీఎస్ రాహుల్ రెడ్డి, అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ జిల్లా అధికారులతో కలసి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, జిల్లా ఎస్పీ అఖిల్ […]

జయంతి తే సుకృతినో రససిద్ధాః కవీశ్వరాః

దివంగత శ్రీపాదరావు గారికి నివాళులతో… sircilla srinivas జయంతి తే సుకృతినో రససిధ్ధాః కవీశ్వరాః నాస్తి తేషాం యశః కాయం జరా మరణజం భయం.. ఎవరైతె విషయపరిజ్ఞానమును ఆమూలాగ్రము పొందారో, మంచి పనుల చేత సిధ్ధులయ్యారో, వారియొక్క కీర్తికి ముసలితనము, మరణము వలన కలిగెడి భయము లేదు…అని భర్త్రహరి అన్నట్టుగా…అజాతశత్రువుగా ప్రజలందరిచేత కీర్తింపబడ్డ నాడు దివంగత శ్రీపాదరావు గారికి భయము లేదు… మరణమూ అంతకంటే లేదు… ఎందుకంటే, నక్సలైట్ ల చర్యలు ఎంత దుందుడుకుగా ఉన్నప్పటికీ, అటవీప్రాంతమైన […]

అజాతశత్రువు దుద్దిళ్ల శ్రీపాదరావు 87వ జయంతి సందర్భంగా… నివాళులతో… 

దుద్దిళ్ల శ్రీపాదరావు  (మార్చి 2, 1935 – ఏప్రిల్ 13, 1999) ,           9వ శాసనసభ స్పీకర్ (1989–1994) (19.08.1991 నుండి 11.01.1995 వరకు) 1935 సంవత్సరంలో మార్చి 2న  కాటారం మండల ధన్వాడ గ్రామానికి చెందిన మౌళి పటేల్ రాధాకిష్టయ్య-కమలాబాయి దంపతులకు జన్మించిన అజాతశత్రువు శ్రీపాదరావు. ఇంటర్, డిగ్రీ హైదరాబాద్ లో చేసిన తరువాత ఆదిలాబాద్  జిల్లాలో పంచాయతి ఇన్స్పెక్టర్ గా ఉద్యోగం కొన్ని రోజులు చేశారు. ఆ తరువాత నాగపూర్ లో న్యాయవాదిగా ప్రజలకు సేవ చేయాలనే తలంపుతో ఎల్. […]

బయో ఏషియా 2024 సదస్సును ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

హెల్త్‌ కేర్, లైఫ్ సైన్సెస్ బయో ఏషియా 2024 సదస్సును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం ప్రారంభించారు.  నోబెల్ అవార్డు గ్రహీత ప్రొఫెసర్ గ్రెగ్ ఎల్ సెమెంజా ఈ ఏడాది జీనోమ్ వ్యాలీ ఎక్సలెన్స్ అవార్డుకు ఎంపికయ్యారు. ప్రారంభోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్​ బాబు పాల్గొని, ప్రొఫెసర్ గ్రెగ్ ఎల్. సెమెంజా కు జీనోమ్ వ్యాలీ ఎక్సెలెన్స్ అవార్డును అందించి అభినందించారు. Sircilla SrinivasSircilla Srinivas […]

బిజెపి నాయకులు కాంగ్రెస్ చరిత్ర తెల్సుకొని మాట్లాడాలి…ప్రెస్ మీట్ లో ఎమ్మెల్సీ టి.జీవన్ రెడ్డి

బిజెపి నాయకులు కాంగ్రెస్ చరిత్ర తెల్సుకొని మాట్లాడాలి…ప్రెస్ మీట్ లో ఎమ్మెల్సీ టి.జీవన్ రెడ్డి బిజెపి అవాకులు చవాకులు పేలితే రావణాసురుడికి పట్టిన గతే పడుతుందనీ.. అరవింద్! కాంగ్రెస్ పార్టీ చరిత్ర తెలుసుకో అని ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి అన్నారు.. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ లో  ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ..బిజెపి విజయ సంకల్ప యాత్రలో భాగంగా జగిత్యాలలో బిజెపి నాయకుల ప్రసంగం ప్రజల్ని […]

తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ గా సీనియర్ పాత్రికేయులు కే శ్రీనివాస్ రెడ్డి నియామకం

హైదరాబాద్: గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్  ప్రెస్ అకాడమీ మొట్టమొదటి చైర్మన్  గా బాధ్యతలు నిర్వహించి, అనుభవమున్నటువంటి సీనియర్ పాత్రికేయులు కే శ్రీనివాస్ రెడ్డి గారు తెలంగాణ ప్రెస్ అకాడమీ/ మీడియా అకాడమీ  చైర్మన్ గా నియామకమైన సందర్భంగా మా హార్థిక శుభాకాంక్షలు…….  –Sircilla Srinivas, Journalist, Jagtial. Former IJU NC Member.  Sircilla SrinivasSircilla Srinivas is a Senior Journalist with 35+ years of experience in Professional Journalism from United […]

అధికారంలోనే విపక్షం-ఎమ్మెల్యే నిర్ణయం బేఖాతర్-కాయ్ రాజా కాయ్… ఒక్కో కౌన్సిలర్ కు అడ్వాన్స్ రూ.50 వేల ఎర?

అధికారంలోనే విపక్షం-ఎమ్మెల్యే నిర్ణయం బేఖాతర్  “బాబు చెప్పినా.. బ్రహ్మ చెప్పినా… ససేమిరా” అన్న చందాన ఆశావహులు –కాయ్ రాజా కాయ్… ఒక్కో కౌన్సిలర్ కు అడ్వాన్స్ రూ.50వేలు ఎర ? పట్టణంలో ప్రచారం –ఎమ్మెల్యే నిర్ణయాన్ని బలపరుస్తారో, డబ్బు ప్రభావానికి లొంగుతారో ?…వెయిట్ అండ్ సీ…. జగిత్యాల మున్సిపల్ లో బిఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లదే మెజారిటీ అన్న సంగతి తెలిసిందే.అయితే, ప్రస్తుతం సాగుతున్న మున్సిపల్ రాజకీయంలో అధికారం కోసం స్వపక్షంలోనే విపక్షం తయారయ్యింది.చైర్పర్సన్ పదవీకాలం ఏడాది మాత్రమే […]

అధికారికంగా…అజాతశత్రువు, మాజీ స్పీకర్ శ్రీపాదరావు జయంతి-ఉత్తర్వులు జారీ

హైదరాబాద్ : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు జయంతి వేడుకలు అధికారికంగా జరపాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు శనివారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది . మార్చి 2న మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు జన్మదినాన్ని స్టేట్ ఫంక్షన్ గా నిర్వహించాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని మంథని ఎమ్మెల్యేగా మూడుసార్లు గెలిచిన శ్రీపాదరావు స్పీకర్ గా పని చేశారు. కాటారం మండలం […]

సామాజిక బాధ్యతతో అర్హులైన ప్రతీ ఒక్కరి పేరును ఓటరు జాబితాలో నమోదు చేయించాలి: కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా

జగిత్యాల : సామాజిక బాధ్యతతో అర్హులైన ప్రతీ ఒక్కరి పేరును ఓటరు జాబితాలో నమోదు చేయించాలని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా అన్నారు. శనివారం సాయంత్రం IDOC సమావేశ మందిరంలో క్యాంపస్ అంబాసిడర్ లకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, కళాశాల, విద్య సంస్థలలో చదువుతున్న 18 ఏళ్లు నిండిన ప్రతీ ఒక్కరి పేరును ఓటరుగా నమోదు చేయించాలని, మంచి వ్యక్తికి ఓటు వేసే విధంగా కృషి చేయాలని అన్నారు. గత […]

Verified by MonsterInsights