రాజన్నసిరిసిల్ల (sampath p)

గ్రామ పంచాయితీలకు ప్రత్యేక అధికారులు ఎంపిక పూర్తయింది.. పంచాయతీల వారీగా నియమిస్తున్న అధికారుల జాబితాను మండల అధికారులు డిపిఓ లు, కలెక్టర్లకు పంపారు. 1వ తేదీన సర్పంచుల పదవీకాలం పూర్తి కానున్నది. అదే రోజు ప్రత్యేక అధికారుల పాలనపై ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వనుంది.

గ్రామపంచాయతీలో ప్రత్యేక పాలన అమల్లోకి రానున్న నేపథ్యంలో 3వ తేదీన పంచాయతీరాజ్ శాఖ మంత్రి అనసూయ( సీతక్క) అన్ని జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఎంపీడీవో ,సెర్ఫ్, పంచాయతీ సెక్రటరీలు ప్రత్యేక అధికారులు పాల్గొనాలని ఆదేశాలు ఇచ్చారు. రెండవ తేదీ నుండి ప్రత్యేక అధికారులకు చెక్ పవర్ దక్కనుంది

సర్పంచ్ ల పదవీకాలం ముగుస్తున్న సందర్భంలో ప్రత్యేక అధికారులకే అన్ని బాధ్యతలు అప్పగించబోతున్నారు. ఫిబ్రవరి 2న వీరంతా విధుల్లో చేరతారు. చెక్ బుక్ లు, డిజిటల్‌ సంతకాలతో కూడిన పెన్ డ్రైవ్ లను వారి వద్దే ఉంచుతారు. ఇకపై ప్రత్యేకాధికారి, పంచాయతీ కార్యదర్శికి జాయింట్‌ చెక్‌పవర్‌ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అభివృద్ధి పనులకు సంబంధించి వారిద్దరి సంతకాలతో నిధులు డ్రా చేసుకోవచ్చని తెలిపింది. తహశీల్దార్లు, డిప్యూటీ తహశీల్దార్లు, ఎంపీడీవోలను ప్రత్యేక అధికారులుగా ప్రభుత్వం నియమించబోతోంది.

https://www.teluguglobal.com/telangana/hyderabad-cp-srinivas-reddy-transferred-the-staff-of-panjagutta-police-station-at-once-995439?infinitescroll=1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Verified by MonsterInsights