దుబ్బాక శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించిన గోద గోష్ఠి బృందం….

శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాలస్వామి ఆలయ ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా, గోదా గోష్టి బృందం, దుబ్బాక శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి ఏర్పాట్లు చేయాలని నేవూరి వెంకట్ రెడ్డి, ఎల్లారెడ్డిపేట సర్పంచ్ ని కోరగా వెంటనే స్పందించిన వెంకట్ రెడ్డి దర్శనానికి వెళ్లడానికి కావలసిన ట్రావెల్ బస్సును ఏర్పాటు చేశారు. అట్టి బస్సులో గోదా గోష్టి బృందం 80 మంది భక్తులు బయలుదేరి వెళ్లారు. భక్త బృందం పసుపుపచ్చ చీరలు ధరించి, భక్తి భజనలతో వెళ్లారు.

వెంకటేశ్వర స్వామి వారికి, వేణుగోపాలస్వామి దేవాలయం తరఫున ఒడిబియ్యం, ముత్యాల తలంబ్రాలు సమర్పించడం జరిగింది. దేవాలయంలో , స్వామివారి పేరు మీద మహార్చన చేయించి గోపాలస్వామి ఆలయ పునర్నిర్మాణం వెంటనే ప్రారంభం కావాలని గట్టి సంకల్పంతో కోరిక కోరుకోనైనది. ఇట్టి కార్యక్రమాన్ని ఆలయ చైర్మన్ గడ్డం జితేందర్, వైస్ చైర్మన్ గంట వెంకటేష్ గౌడ్, హరే కృష్ణ భక్తులు ఈశ్వర్, నారాయణ ఉపాసకులు పోతు ఆంజనేయులు ప్రారంభించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Verified by MonsterInsights